AP News.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం: మంత్రి గుడివాడ అమర్ నాధ్
ABN , First Publish Date - 2022-09-09T18:42:09+05:30 IST
మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని మంత్రి గుడివాడ అమర్నాధ్ పేర్కొన్నారు.
విశాఖ (Visakha): విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్నది సీఎం జగన్ (CM Jagan) ఆలోచన అని, మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని మంత్రి గుడివాడ అమర్నాధ్ (Gudivada Amarnadh) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతి వివాదాలు, వాస్తవాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిపక్షనేత చంద్రబాబు, పలు రాజకీయ నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని విమర్శించారు. రాష్ట్రంలో 29 గ్రామాలు తప్పితే.. మిగిలిన జిల్లాలు అవసరం లేదా? అని ప్రశ్నించారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తామని రైతులు అంటున్నారని, విశాఖకు రాజధాని వద్దని చేస్తున్న పాదయాత్ర ఇదని.. ఇది దండయాత్రేనని అన్నారు. ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తే.. ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు.