మళ్లీ తెరపైకి గుడివాడ డబుల్‌ మర్డర్‌ కేసు

ABN , First Publish Date - 2021-03-30T21:35:09+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసును

మళ్లీ తెరపైకి గుడివాడ డబుల్‌ మర్డర్‌ కేసు

కృష్ణా: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడివాడ వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు మళ్లీ తిరగదోడుతున్నారు. ఈ కేసును గుడివాడ డబుల్‌ మర్డర్‌ కేసుగా పేర్కొన్నారు. గుడివాడకు చెందిన వ్యాపారవేత్త బొప్పన సాయి చౌదరి, బొప్పన నాగమణి దంపతులు 2018లో గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ జంట హత్యల కేసు ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ హత్య కేసులో అనుమానితులుగా జిల్లెల సురేష్, సెల్వ దొరైలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రాసిక్యూషన్ వాదన అసంపూర్తిగా ఉందని పేర్కొంటూ నిందితులను విడుదల చేస్తూ గుడివాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై  హైకోర్టులో రివిజన్ పిటిషన్‌ను పోలీసులు వేస్తున్నారు. 

Updated Date - 2021-03-30T21:35:09+05:30 IST