Coronavirus: తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు ఆర్థికసాయం!
ABN , First Publish Date - 2021-07-31T14:59:19+05:30 IST
దేశంలో కరోనా వైరస్ చాలామంది చిన్నారులను అనాథలుగా మార్చివేసింది.
గాంధీనగర్: దేశంలో కరోనా వైరస్ చాలామంది చిన్నారులను అనాథలుగా మార్చివేసింది. ఈ నేపధ్యంలో ఇటువంటి చిన్నారులను ఆదుకునేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పలు విధాలుగా సాయం అందిస్తున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఇటువంటి చిన్నారులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన 42 మంది చిన్నారులకు నెలకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రి బాల్ సేవా యోజన కింద ఈ చిన్నారులు ప్రభుత్వం సాయం అందించనుంది.