IPL 2022: రాజస్థాన్పై టాస్ నెగ్గిన Gujarat Titans
ABN , First Publish Date - 2022-05-25T00:46:02+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చివరి అంకానికి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చివరి అంకానికి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. కాబట్టి మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఓడిన జట్టు మాత్రం రెండో క్వాలిఫయర్ ఆడి అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది.
ఈ సీజన్తోనే అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ తొలి నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ అగ్రస్థానానికి చేరుకుంది. నేటి మ్యాచ్లోనూ ఇదే జోరు కొనసాగిస్తుందో, లేదో వేచి చూడాలి. రాజస్థాన్ రాయల్స్ కూడా బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ 2 సార్లు, గుజరాత్ టైటాన్స్ 6 సార్లు విజయం సాధించాయి. రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఏడుసార్లు విజయం సాధిస్తే, గుజరాత్ను నాలుగు సార్లు మాత్రమే విజయం వరించింది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టులో ఒక్క మార్పు చోటుచేసుకుంది. లాకీ ఫెర్గ్యూసన్ స్థానంలో అల్జారీ జోసెఫ్ జట్టులోకి వచ్చాడు. రాజస్థాన్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.