గుజరాత్ టైటాన్స్ ఖాతాలో మరో విజయం
ABN , First Publish Date - 2022-04-24T01:13:25+05:30 IST
ముంబై : గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కలకత్తా నైట్ రైడర్స్పై 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుగు బ్యా
ముంబై : ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్కత్తా నైట్ రైడర్స్పై 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుగు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కోల్కత్తా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ చేధించలేపోయారు. లక్ష్య చేధనకు దిగిన కోల్కతా బ్యాట్స్మెన్లలో సామ్ బిల్లింగ్స్(4), సునీల్ నరైన్(5), శ్రేయస్ అయ్యర్(12), నితీష్ రానా(2), రింకు సింగ్(35), వెంకటేష్ అయ్యర్(17), ఆండ్ర్యూ రస్సెల్(48), శివమ్ మావీ(2), ఉమేష్ యాదవ్(15 నాటౌట్), టిమ్ సౌతీ(1, నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మొహమ్మద్ షమీ 2, యస్ దయాల్ 2, అల్జారీ జోసెఫ్ 1, లాకీ ఫెర్గూసన్ 1, రషీద్ ఖాన్ 2 చొప్పున వికెట్లు తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్మెన్లు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేశారు. వృద్ధిమాన్ సాహా(25), శుభ్మన్ గిల్(7), హార్ధిక్ పాండ్యా(67), మిల్లర్(27), రాహుల్ తివాటియా(17), రషీద్ ఖాన్(0), అభినవ్ మనోహర్(2), లాకీ ఫెర్గూసన్(0), అల్జారీ జోసెఫ్(1 నాటౌట్), యస్ దయాల్(0) చేశారు.