అక్షర్‌ధామ్ మందిరంలో బ్రిటన్ ప్రధాని పూజలు

ABN , First Publish Date - 2022-04-22T01:57:47+05:30 IST

గాంధీనగర్: భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్‌ గాంధీనగర్‌లోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించారు

అక్షర్‌ధామ్ మందిరంలో బ్రిటన్ ప్రధాని పూజలు

గాంధీనగర్: భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్‌ గాంధీనగర్‌లోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించారు. స్వాములు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ఇంఛార్జ్ స్వామీజీ బోరిస్ జాన్సన్ చేతిలో చేయి వేసి ఆలయంలోకి నడిపించారు. అనంతరం ఆలయం లోపల బ్రిటన్ ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 



అంతకుముందు బోరిస్ జాన్సన్ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. గాంధీజీ ఉపయోగించిన చర్ఖాపై నూలు వడికారు. భారత్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమౌతారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ వేళ బోరిస్ భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.       



Updated Date - 2022-04-22T01:57:47+05:30 IST