నా సేన కోసం నా వంతు.. జనసేన పార్టీకి అండగా గల్ఫ్ సేన జన సేన..
ABN , First Publish Date - 2022-09-10T22:26:27+05:30 IST
సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, యూఏఈ, ఖతార్ దేశాల ఐక్య వేదిక గల్ఫ్ సేన.. జన సేన పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9న "నా సేన కోసం నా వంతు" కార్యక్రమాన్ని జూమ్ ద్వారా నిర్వహించారు.
సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, యూఏఈ, ఖతార్ దేశాల ఐక్య వేదిక గల్ఫ్ సేన.. జన సేన పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9న "నా సేన కోసం నా వంతు" కార్యక్రమాన్ని జూమ్ ద్వారా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జన సేన పార్టీ ఉపాధ్యక్షులు, ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ ప్రెసిడెంట్ మహేంద్ర రెడ్డి, కమిటీ కన్వీనర్ ఉదయ్ శ్రీనివాస్, కో కన్వీనర్ రుక్మిణీ, IT విభాగం నుంచి సంజయ్, కమిటీ మెంబర్ రవి కుమార్ పాల్గొన్నారు. గల్ఫ్ సేన జన సేన నుంచి ఆరు దేశాల కో ఆర్డినేటర్లు, కోర్ మెంబెర్స్ సుమారుగా 100 మంది ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. కమిటీ ప్రెసిడెంట్ మహేంద్ర మాట్లాడుతూ.. గల్ఫ్లో ఉన్న జన సైనికులను అందరినీ కలుపుకొని ఎలా ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలనే అంశంపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ అధ్యక్షులు పార్టీ కోసం కష్టపడుతున్న NRI లను గుర్తించి ,త్వరలోనే NRI కమిటీని ప్రకటిస్తారన్నారు. ఆ కమిటీ ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. అందుకోసం అధ్యక్షులు కసరత్తు చేస్తున్నట్లు తెలియ చేశారు.
ఈ సందర్భంగా ఆరు గల్ఫ్ దేశాల నుంచి సుమారుగా అయిదు వేల మందిని నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాస్వామ్యులను చేశామని గల్ఫ్ సేన జన సేన సభ్యులు రాష్ట్ర కమిటీకి తెలియచేశారు. అయిదు వేల మందిని భాగస్వాములను చేసే కార్యక్రమాన్ని గల్ఫ్ దేశాల్లో ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలో సభ్యుల మధ్య చర్చ జరిగిన అనంతరం, కార్యాచరణ రూపొందించారు. ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ సభ్యులు అందరూ, గత నాలుగు సంవత్సరాలుగా పార్టీనీ బలోపేతం చేయడంలో భాగస్వాములుగా ఉన్న గల్ఫ్ సేన జన సేన సభ్యులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసారు.
రాజకీయాల్లో మార్పు కోసం, భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం, నిత్యం ప్రజల పక్షాన నిరంతరం శ్రమిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు, జనసేన పార్టీ అండగా నిలబడాలని, పార్టీలో భాగస్వాములు అయ్యేందుకు విరాళాలు అందిద్దామని, వ్యవస్థలో మార్పు కోసం మరింత బలంగా పోరాడుదామని గల్ఫ్ సేన జన సేన సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జనసైనికుడికి, పార్టీకి అండగా నిలబడి విరాళాలు అందిస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరున గల్ఫ్ సేన జన సేన సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు.