వైసీపీ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్

ABN , First Publish Date - 2021-12-28T22:19:49+05:30 IST

మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హోళగుంద మండలం పెద్ద గోనేహల్ రహదారి విషయంలో మంత్రి స్థానికుడితో మాట్లాడారు.

వైసీపీ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్

కర్నూలు: మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హోళగుంద మండలం పెద్ద గోనేహల్ రహదారి విషయంలో మంత్రి స్థానికుడితో మాట్లాడారు. ‘‘కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కాపీపై సంతకం చేయమని ఎంపీడీవోకు చెప్తానని, వినకపోతే రివర్స్ కేసు పెట్టిస్తానని ఎంపీడీవోను బెదిరిస్తానంటూ మంత్రి గుమ్మనూరు జయరాం ఆడియోపై స్థానికంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం బీసీ సామాజిక వర్గానికి మద్దతు పలుకుతున్నారంటూ ఆలూరులో దళితులు ధర్నాకు దిగారు. 

Updated Date - 2021-12-28T22:19:49+05:30 IST