TDP Leaders.. గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2022-09-05T18:05:47+05:30 IST

తెలుగు దేశం పార్టీ నేతలు గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు.

TDP Leaders.. గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన టీడీపీ నేతలు

ప్రకాశం జిల్లా (Prakasam Dist.): తెలుగు దేశం పార్టీ (TDP) ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్.విజయ్ కుమార్ గుండ్లకమ్మ ప్రాజెక్టు (Gundlakamma project)ను సందర్శించారు. ప్రాజెక్టులో కొట్టుకు పోయిన 3వ గేటుతో పాటు లీక్ అవుతున్న మరో మూడు గేట్లను పరిశీలించారు. గత ఐదు రోజులుగా ప్రాజెక్టులోని నీరంతా వృధాగా సముద్రం పాలు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందు చూపు పర్యవేక్షణ లోపంవల్లే ఈ పరిస్థితికి కారణం అంటూ టీడీపీ నేతలు (TDP Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-09-05T18:05:47+05:30 IST