గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2020-12-04T05:15:21+05:30 IST

గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ అభివృద్ధికి కృషి

గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ అభివృద్ధికి కృషి
పనులను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్‌, అధికారులు

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి


మేడ్చల్‌ రూరల్‌: గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ అభివృద్దికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. గురువారం మున్సిపల్‌ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను చైర్‌పర్సన్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. మైసమ్మగూడలో శ్మశానవాటిక పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు పనులు నాణ్యతతో  చేపట్టే విధంగా కౌన్సిలర్లు  చూడాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్‌ పెంటయ్యముదిరాజ్‌, డీఈ చిరంజీవులు, పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:15:21+05:30 IST