గుంటూరులో కొనసాగుతున్న నిరసనలు
ABN , First Publish Date - 2021-04-23T18:10:47+05:30 IST
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుకు నిరసనగా గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.
అమరావతి: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుకు నిరసనగా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. విజయవాడ గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లే రహదారిని పోలీసులు దిగ్భంధం చేశారు. నరేంద్రను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆందోళన చేపట్టారు. వెంటనే ధూళిపాళ్లను విడుదల చేయాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.