గుంటూరు: రౌడీషీటర్ తరుణ్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-06-17T18:23:49+05:30 IST
తెనాలిలో అమరావతి కాలనీకి చెందిన రౌడీ షీటర్ చప్పిడి తరుణ్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరు: తెనాలిలో అమరావతి కాలనీకి చెందిన రౌడీ షీటర్ చప్పిడి తరుణ్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన రౌడీ షీటర్ షేక్ అక్బర్, అతని మిత్రులు రాజశేఖర్, ఈశ్వర్ చరణ్ రెడ్డిలను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను కోర్టుకు హాజరు పరుస్తునట్లు డీఎస్పీ కే.స్రవంతి రాయ్ వెల్లడించారు.