Guntur: తాడేపల్లిలో భరతమాత విగ్రహం తొలగింపుపై స్థానికుల ఆగ్రహం
ABN , First Publish Date - 2021-08-24T13:35:07+05:30 IST
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద భరతమాత విగ్రహం తొలగింపుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు: తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద భరతమాత విగ్రహం తొలగింపుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లికి ప్రధాన ఆకర్షణగా ఉన్న భరతమాత విగ్రహాన్ని ఎలా తొలగిస్తారంటూ నిరసనకు దిగారు. తాడేపల్లిలోని భరతమాత విగ్రహాన్ని అర్ధరాత్రి క్రేన్ సహాయంతో మున్సిపల్ అధికారులు తొలగించి వేరే చోటికి తరలించారు. దశాబ్దం క్రితం కాగితాల రమేష్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సీఎం ఇంటికి భద్రత, రోడ్ వెడల్పు పేరుతో అధికారులు తొలగించారు. దీంతో మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు ఆందోళనలు చేపట్టారు.