గుంటూరులో టీడీపీ ఆందోళన

ABN , First Publish Date - 2021-08-27T18:34:49+05:30 IST

చెత్తపై యూజర్ చార్జీలను నిరసిస్తూ జిల్లాలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

గుంటూరులో టీడీపీ ఆందోళన

గుంటూరు: చెత్తపై యూజర్ చార్జీలను నిరసిస్తూ జిల్లాలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. చెత్త బండ్లు తోసుకుంటూ కార్పోరేషన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. టీడీపీ కార్పోరేటర్లు ఆందోళనలో పాల్గొన్నారు.  మరోవైపు చెత్త సేకరణ యూజర్ చార్జీలపై నేడు కౌన్సిల్ సమావేశంలో చర్చ జరుగనుంది. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ చెత్త సేకరణ యూజర్ చార్జీల పెంపుపై అత్యవసర సమావేశం ఏంటని ప్రశ్నించారు. ప్రజలపై భారం వేసే నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్ బే ల ఏర్పాటు పైనా గతంలో వ్యతిరేకత రావడంతో టీడీపీ ఆ పని చేయలేదని తెలిపారు. బహిరంగ వేలం నిర్వహించి బస్ బే ల నిర్మాణం చేపట్టాలని రవీంద్ర డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-08-27T18:34:49+05:30 IST