Guntur: రెడ్డిగూడెం ఈద్గ వద్ద ఆందోళన
ABN , First Publish Date - 2021-08-27T18:43:42+05:30 IST
జిల్లాలోని రాజుపాలెం మండల రెడ్డిగూడెం ఈద్గ దగ్గర ఆందోళన నెలకొంద.
గుంటూరు: జిల్లాలోని రాజుపాలెం మండల రెడ్డిగూడెం ఈద్గ వద్ద ఆందోళన నెలకొంది. ఈద్గ స్ధలంలో రైతు భరోసా కేంద్రం, కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు అధికారుల సన్నాహాలు చేపట్టారు. కాగా ఏర్పాట్లను స్థానిక ముస్లింలు అడ్డుకుంటున్నారు. ఈద్గకు సంబంధించిన సర్వే నెంబర్ 224లో రెండు ఎకరాల స్థలంలోని కొంత భాగంలో కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. అయితే ఈద్గా స్థలంలో నిర్మాణాలు వద్దంటూ స్థానికులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఈద్గ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.