తెనాలి హత్యాయత్నం కేసులో పోలీసులకు లొంగిపోయిన నిందితులు
ABN , First Publish Date - 2020-08-08T18:36:03+05:30 IST
జిల్లాలోని తెనాలి మార్కెట్ వద్ద జరిగిన హత్యా యత్నం కేసులో నలుగురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
గుంటూరు: జిల్లాలోని తెనాలి మార్కెట్ వద్ద జరిగిన హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంశెట్టి కిషోర్పై నాని అతని మిత్రులు ప్రభు, నవీన్, వసంత్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కిషోర్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి పాల్పడిన నాని, ప్రభు, నవీన్ గతంలో పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. నిందితుల్లో ఒకరైన గొట్టిముక్కల నవీన్ 32వ వార్డు వాలంటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన కిషోర్ ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు.