నాగేంద్ర ఆరోగ్యం మెరుగుపడుతోంది: జీజీహెచ్ సూపరింటెండెంట్

ABN , First Publish Date - 2020-10-26T17:56:44+05:30 IST

విజయవాడ దివ్య తేజశ్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

నాగేంద్ర ఆరోగ్యం మెరుగుపడుతోంది: జీజీహెచ్ సూపరింటెండెంట్

గుంటూరు: విజయవాడ దివ్య తేజశ్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి మీడియాకు తెలియజేశారు. నాగేంద్రబాబు ఆరోగ్యం మెరుగు పడుతోందని అన్నారు. మొదట హాస్పిటల్‌లో చేరినప్పుడు కత్తి పోట్లతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని... 12 రోజుల నుండి జీజీహెచ్ వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు.  ఆపరేషన్ చేసిన సమయంలో కుట్లు తీశారన్నారు. నాగేంద్రబాబు కోలుకుంటున్నాడని... రెండు రోజుల తర్వాత నాగేంద్రబాబు డిశ్చార్జిపై వైద్యులు నిర్ణయం తీసుకుంటారని ప్రభావతి వెల్లడించారు. 

Updated Date - 2020-10-26T17:56:44+05:30 IST