కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-22T15:20:23+05:30 IST
జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామలో కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య కలకలం రేపుతోంది.
గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామలో కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. గ్రామంలోని కాల్వలో దూకి డేగల శివ నాగమల్లేశ్వరి(40) అనే మహిళ బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.