ఆయన మృతికి మాకు సంబంధం లేదు: పోలీసులు
ABN , First Publish Date - 2021-03-04T20:28:55+05:30 IST
ఆయన మృతికి మాకు సంబంధం లేదు: పోలీసులు
గుంటూరు: జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద జమ్మలమడుగు గ్రామస్తుల నిరసన ప్రదర్శన చేశారు. మాచర్ల రూరల్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పోలీసుల కొట్టడం వల్లే శివరామకృష్ణ పురుగు మందు తాగాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. కేసు విచారణ లో భాగంగా శివరామకృష్ణ పురుగు మందు తాగి మృతి చెందాడు. మరోవైపు శివరామకృష్ణ మృతికి తమకు సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు.