గురజాల రైల్వేస్టేషన్‌లో దారుణం

ABN , First Publish Date - 2022-04-16T15:42:19+05:30 IST

జిల్లాలోని గురజాల రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది.

గురజాల రైల్వేస్టేషన్‌లో దారుణం

గుంటూరు: జిల్లాలోని గురజాల రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. రైల్వే గేట్ హల్ట్ రూం వద్ద ఓ మహిళాపై కొందరు వ్యక్తలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి అత్యాచారం చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. రక్తపు మరకలతో పడి ఉన్న మహిళను స్థానికులు గుర్తించి గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళా పక్కన ఏడాదిన్నర పసి బాబు ఉన్నాడు. స్పృహ కోల్పోయిన తల్లి పక్కన ఆయకంగా పడుకున్న పసి బిడ్డను చూసి అందరి మనసు కలిచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-16T15:42:19+05:30 IST