మహిళలను కాళ్లతో తన్ని... వృద్ధులపై దాడి చేసిన పత్రికా విలేఖరి

ABN , First Publish Date - 2022-04-30T17:28:57+05:30 IST

జిల్లాలోని తాడేపల్లిలో ఓ పత్రికా విలేఖరి నాగిరెడ్డి రెచ్చిపోయాడు.

మహిళలను కాళ్లతో తన్ని... వృద్ధులపై దాడి చేసిన పత్రికా విలేఖరి

గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలో ఓ పత్రికా విలేఖరి నాగిరెడ్డి రెచ్చిపోయాడు. పోలకంపాడులో స్థలం ఖాళీ చేసే విషయంలో జోక్యం చేసుకుని వృద్ధుడు కోటేశ్వరావు‌పై నాగిరెడ్డి దాడికి పాల్పడ్డాడు. కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడిన వృద్ధుడిపైనా, కుటుంబ సభ్యులపై విలేఖరి కనికరం చూపలేదు. అడ్డకున్న మహిళలను కర్కశంగా కాళ్లతో తన్నాడు. నాగిరెడ్డి దందాలు స్థానికంగా తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం నాగిరెడ్డి దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Updated Date - 2022-04-30T17:28:57+05:30 IST