Gunturలో మహిళ దారుణ హత్య

ABN , First Publish Date - 2022-06-02T17:23:27+05:30 IST

జిల్లాలోని లాలాపేటలో నేరేళ్ల పద్మావతి అనే మహిళ దారుణ హత్యకు గురైంది.

Gunturలో మహిళ దారుణ హత్య

గుంటూరు: జిల్లాలోని లాలాపేటలో నేరేళ్ల పద్మావతి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో పద్మావతి మృతదేహం పడి ఉంది. మూర్తి ఫ్యాషన్స్ వస్త్ర దుకాణంలో మహిళ పనిచేస్తోంది. కొద్ది నెలల క్రితం భర్త చనిపోవడంతో పద్మావతి ఒంటరిగా జీవిస్తోంది. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-02T17:23:27+05:30 IST