Guntur: చలో కంతేరుపై పోలీసుల ఆంక్షలు
ABN , First Publish Date - 2022-06-13T15:57:25+05:30 IST
చలో కంతేరుకు టీడీపీ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
గుంటూరు: చలో కంతేరుకు టీడీపీ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చలో కంతేరుపై పోలీసులు ఆంక్షలు విధించారు. కంతేరులో భారీగా పోలీసులు మోహరించారు. చలో కంతేరుకు వెళ్లనీయకుండా మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజా, టీడీపీ ఇన్ చార్జ్ కోవెలమూడి రవీంద్రలను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.