గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల ఆందోళన
ABN , First Publish Date - 2021-10-11T17:16:27+05:30 IST
జిల్లాలోని మున్సిపల్ శాఖ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.
గుంటూరు: జిల్లాలోని మున్సిపల్ శాఖ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ టీచర్ల సమస్యలు పరిష్కారించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణ రావు మాట్లాడుతూ మున్సిఫల్ పాఠశాలలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించటం లేదన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా టీచర్ల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. టీచర్ల జీపీఎఫ్ ఖాతాలను వెంటనే తెరవాలన్నారు.
ఎమ్మెల్సీ సాబ్జీ మాట్లాడుతూ...టీచర్ల జీపీఎఫ్ ఖాతాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పాఠశాలల్లో లక్ష మంది విద్యార్థులు పెరిగారని, మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలు వెంటనే చేపట్టాలని అన్నారు. అధికారులే తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. పోలీసుల సాయంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.