గుంటూరు మార్కెట్ సెంటర్‌లో విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-27T17:30:29+05:30 IST

జిల్లాలోని మార్కెట్ సెంటర్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను కాపాడాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.

గుంటూరు మార్కెట్ సెంటర్‌లో విద్యార్థుల ఆందోళన

గుంటూరు: జిల్లాలోని  మార్కెట్ సెంటర్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను కాపాడాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. వందలాది మంది విద్యార్దులతో మానవ హారం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు - విద్యార్థులు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. 

Updated Date - 2021-10-27T17:30:29+05:30 IST