గుంటూరు జిల్లాలో మద్యం తాగి ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-05-03T01:49:21+05:30 IST

గుంటూరు జిల్లాలో మద్యం తాగి ఇద్దరు మృతి

గుంటూరు జిల్లాలో మద్యం తాగి ఇద్దరు మృతి

గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేటలో మద్యం తాగిన ఇద్దరు మృతి చెందారు. మద్యం తాగి అస్వస్థతకు గురైన మస్తాన్ షరీఫ్(52), బషీర్ అహ్మద్(35)గా గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షరీఫ్‌, బషీర్‌ ప్రాణాలుకోల్పోయారు. అయితే మృతుల కుటుంబాలను మాజీమంత్రి పుల్లారావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకే బాటిల్‌ మద్యం తాగిన బషీర్, మస్తాన్ మృతిచెందాదరని చెప్పారు. మృతులు తాగిన చీప్ లిక్కన్‌ను ల్యాబ్‌కు పంపాలని సూచించారు. అలాగే మృతి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Read more