Guntur: ఐదు గ్రామాల్లో కోవిడ్ కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-07-18T22:24:36+05:30 IST

Guntur: ఐదు గ్రామాల్లో కోవిడ్ కర్ఫ్యూ

Guntur: ఐదు గ్రామాల్లో కోవిడ్ కర్ఫ్యూ

గుంటూరు: కరోనా వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే గుంటూరు జిల్లాలో మాత్రం కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తాడికొండ మండలంలోని ఐదు గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. తాడికొండ, దామరపల్లి, లామ్, పొన్నెకల్లు, బండారుపల్లి గ్రామాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తహాశీల్దార్ కుటుంబ రావు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఐదు గ్రామాల్లో కోవిడ్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2021-07-18T22:24:36+05:30 IST