గుంటూరుకు చేరుకున్న రోడ్ రిలే స్కేటర్ల బృందం

ABN , First Publish Date - 2021-07-25T15:32:32+05:30 IST

రోడ్ రిలే స్కేటర్ల బృందం గుంటూరుకు చేరుకుంది. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం..

గుంటూరుకు చేరుకున్న రోడ్ రిలే స్కేటర్ల బృందం

గుంటూరు: రోడ్ రిలే స్కేటర్ల బృందం గుంటూరుకు చేరుకుంది. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం.. అలాగే ఈ బృందం ప్రపంచ రికార్డుకు ప్రయత్నం చేసింది. శనివారం విశాఖ నుంచి ప్రారంభమైన రోడ్ రిలే స్కేటింగ్ ప్రదర్శన బృందం 24 గంటల్లో విశాఖ నుంచి గుంటూరుకు చేరుకుంది. ఐకె స్కేటింగ్ అకాడమీ క్రీడాకారులు వజ్ర వరల్డ్ రికార్డు సృష్టించారు. అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డులో ప్రదర్శన నమోదుకు అవకాశం కలిగింది. ఆదివారం సాయంత్రం ప్రతినిధులు రికార్డు ప్రతులను అందజేయనున్నారు.

Updated Date - 2021-07-25T15:32:32+05:30 IST