రాజశేఖర్ రెడ్డికి మరోసారి రిమాండ్

ABN , First Publish Date - 2021-07-28T16:49:22+05:30 IST

గుంటూరు జిల్లా: లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డికి న్యాయస్థానం మరోసారి రిమాండ్ విధించింది.

రాజశేఖర్ రెడ్డికి మరోసారి రిమాండ్

గుంటూరు జిల్లా: లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డికి న్యాయస్థానం మరోసారి రిమాండ్ విధించింది. న్యాయమూర్తిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బెయిల్‌పై విడుదలైన లింగారెడ్డి తొలి వాయిదాకే గైర్హాజరయ్యాడు. దీంతో జడ్జి ఆగ్రహించడంతో.. కోర్టులో లొంగిపోయిన ఆయనకు ఆగస్టు 5 వరకు న్యాయమూర్తి రమణ రిమాండ్ విధించారు.


న్యాయవాదులు, తీర్పులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన తీరుపై న్యాయస్థానం సీరియస్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిపై కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు కడప జిల్లాకు చెందిన రాజశేఖర్ రెడ్డిని ఈ నెల 10న సీబీఐ పోలీసులు అరెస్టు చేసి గుంటూరులోని 4వ అదరపు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చగా అతనికి రిమాండ్ విధించింది. ఆ తర్వాత మూడు రోజులు సీబీఐ కస్టడీ కోరింది. అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. శుక్రవారం తొలి వాయిదాకు గైర్హాజరుకావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం మరోసారి వారెంట్ జారీ చేసింది. దీంతో లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి కోర్టులో లొంగిపోయాడు.

Updated Date - 2021-07-28T16:49:22+05:30 IST