గుంటూరు: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆశా వర్కర్ మృతి
ABN , First Publish Date - 2021-01-24T15:39:11+05:30 IST
గుంటూరు: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి మృతి చెందింది.
గుంటూరు: వ్యాక్సిన్ రియాక్షన్ అయింది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి మృతి చెందింది. వ్యాక్సిన్ వేయించుకుని అనారోగ్యానికి గురైన ఆమె జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించింది. ఈ నెల 19న విజయలక్ష్మి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంది. 21వ తేదీన అస్వస్థతకు గురై జీజీహెచ్లో చేరింది. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు.. బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయినట్లు ఆదివారం ఉదయం ప్రకటించారు. విజయలక్ష్మి తాడేపల్లి మండలం, పెనుమాకలో ఆశా వర్కర్గా పని చేస్తోంది.