Guntur జిల్లా: తాడికొండలో TDP నేతపై వైసీపీ శ్రేణుల దాడి...

ABN , First Publish Date - 2022-05-30T15:48:16+05:30 IST

Guntur: జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. తమను ఎదిరించిన వారిపై దాడులకు దిగుతున్నారు.

Guntur జిల్లా: తాడికొండలో TDP నేతపై వైసీపీ శ్రేణుల దాడి...

Guntur: జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. తమను ఎదిరించిన వారిపై దాడులకు దిగుతున్నారు. తాడికొండ (Tadikonda)లో అక్రమ మైనింగ్‌పై టీడీపీ (TDP) మైనారిటీ నేతలు కలెక్టర్‌ (Collector)కు ఫిర్యాదు చేశారు. అది తెలుసుకున్న అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేసిన షేక్ సుభానిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన సుభాని అపస్మాకరస్థితిలోకి వెళ్లడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని టీడీపీ నేతలు పరామర్శించారు. అండగా ఉంటామని సుభాని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైసీపీ నేతల దుర్మార్గాలకు త్వరలోనే సమాధానం చెబుతామని టీడీపీ నేతలు అన్నారు. తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఎన్ని దాడులు చేసినా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాకతీ, సుభానిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-05-30T15:48:16+05:30 IST