గుంటూరు జిల్లా: పందుల పెంపకందారుల నిరసన
ABN , First Publish Date - 2021-10-27T15:43:27+05:30 IST
గుంటూరు: తెనాలి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు సిబ్బంది రోడ్లపై తిరుగుతున్న పందులను...
గుంటూరు: తెనాలి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు సిబ్బంది రోడ్లపై తిరుగుతున్న పందులను పట్టుకుని వేరే ప్రదేశాలకు తరలించే ప్రయత్నం చేశారు. మల్లెపాడు నుంచి పందులను తరలిస్తుండగా విషయం తెలుసుకున్న పందుల పెంపకం దారులు వాహనాలను అడ్డుకుని రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని నిరసనకారులను పక్కకు తరలించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.