గుంటూరు విద్యార్థిని అత్యాచారం కేసులో కొత్త కోణం
ABN , First Publish Date - 2020-07-07T00:02:35+05:30 IST
విద్యార్థిని అత్యాచారం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని .....
గుంటూరు: విద్యార్థిని అత్యాచారం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని న్యూడ్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ కేసుకు సంబంధించి తొలుత ఏ1 వరుణ్ తేజ్, ఏ2 కౌశిక్ను అరెస్ట్ చేశారు. తర్వాత మణికంఠ, ధనుంజయరెడ్డి, భాస్కర్, తులసికృష్ణ, కేశవ్, క్రాంతి కిరణ్, రోహిత్ను అరెస్ట్ చేశారు. విద్యార్థిని చదివిన కాలేజీలోని ఓ విద్యార్థికి కూడా ఈ న్యూడ్ ఫొటోలు పంపారు. అశ్లీల వెబ్సైట్తో పాటు ఫేక్ ఐడీ సృష్టించి ఇన్స్టాగ్రామ్లో కూడా విద్యార్థిని న్యూడ్ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. అంతేకాదు విద్యార్థిని బెదిరించి డబ్బులు కూడా వసూలు చేశారు.