-
-
Home » Andhra Pradesh » guntur government hospital child andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Guntur ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం... ప్రాణాపాయ స్థితిలో చిన్నారి
ABN , First Publish Date - 2022-05-09T19:24:40+05:30 IST
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ పాప పరిస్థితి విషమంగా మారింది.
గుంటూరు: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ పాప పరిస్థితి విషమంగా మారింది. ఆరాధ్య అనే ఐదు సంవత్సరాల చిన్నారికి కంటికింద కణితి రావడంతో తల్లిదండ్రులు గురువారం ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. 10 నిముషాల ఆపరేషన్ అని చెప్పి పాపను మూడురోజుల నుంచి వెంటిలేటర్పై ఉంచారని తల్లిదండ్రులు చెబుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న పాపను ఆసుపత్రికి తీసుకువస్తే వైద్యులు చనిపోయే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. పాపను బ్రతికించండి అంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన అధికారి తక్షణమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.