గుంటూరు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన విపక్ష నేతలు

ABN , First Publish Date - 2021-06-21T19:16:24+05:30 IST

కరోనా సమస్యలపై విపక్ష నేతలు సోమవారం కలెక్టర్ వివేక్ యాదవ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

గుంటూరు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన విపక్ష నేతలు

గుంటూరు: కరోనా సమస్యలపై విపక్ష నేతలు సోమవారం కలెక్టర్ వివేక్ యాదవ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు.  కరోనా బాధితులకు నెలకు రూ.7,500 భృతి ఇవ్వాలని అఖిలపక్షం విజ్ఞప్తి చేసింది. కరోనా బాధితులను అదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష నేతలు ఆరోపించారు. టీడీపీ నేతలు నక్కా ఆనంద బాబు, తెనాలి శ్రావణ కుమార్, కోవెలమూడి రవీంద్ర,  మహ్మద్ నసీర్, సీపీఐ, సీపీఎం, జనసేన నాయకులు...కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

Updated Date - 2021-06-21T19:16:24+05:30 IST