Guntur: మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఫోన్లో బెదిరింపులు
ABN , First Publish Date - 2022-06-30T17:28:14+05:30 IST
జిల్లాలోని మణిపాల్ హస్పిటల్ ఎండీకి ఫేక్కాల్స్తో దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. సీఎం పీఏ అని చెబుతూ డబ్బులు డిమాండ్ చేశారు.
గుంటూరు: జిల్లాలోని మణిపాల్ హస్పిటల్ ఎండీకి ఫేక్కాల్స్తో దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. సీఎం పీఏ అని చెబుతూ డబ్బులు డిమాండ్ చేశారు. ఆంధ్రాకు చెందిన క్రికెటర్ రుక్కీ బాయ్కు ఇంటర్నేషల్ క్రికెట్ కిట్ అవసరమని... రూ.10 లక్షల 40 వేల 440 రూ పంపించాలని మణిపాల్ ఎండీకి దుండగులు మెసేజ్ చేశారు. ఈ వ్యవహారంపై మణిపాల్ ఎండీ తాడేపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.