అన్ని సౌకర్యాలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

ABN , First Publish Date - 2022-01-23T04:46:00+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున కొవిడ్‌ కేర్‌ సెంటర్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌(సచివాలయాలు) జి.రాజకుమారి ఆదేశించారు.

అన్ని సౌకర్యాలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు
అడవి తక్కెళ్లపాడు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ని సందర్శిస్తోన్న జేసీ రాజకుమారి

గుంటూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున కొవిడ్‌ కేర్‌ సెంటర్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌(సచివాలయాలు) జి.రాజకుమారి ఆదేశించారు. శనివారం ఆమె అడవితక్కెళ్లపాడులోని ఏపీ టిడ్కో భవనాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ సమకూర్చారో అడిగి తెలుసుకొన్నారు. వాటర్‌, డస్టుబిన్‌, పడకలను పరిశీలించారు. రక్తపరీక్షలు, ఎక్స్‌-రే గదులు, స్టోర్స్‌ అండ్‌ స్టాఫ్‌ రూంలు తనిఖీ చేశారు.  జేసీ వెంట నోడల్‌ అధికారి డాక్టర్‌ లక్ష్మానాయక్‌, డ్వామా పీడీ యుగంధర్‌కుమార్‌, టాండన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T04:46:00+05:30 IST