ఓటీఎస్ మెగా మేళాలో 3,883 మంది దరఖాస్తు
ABN , First Publish Date - 2021-12-05T05:57:49+05:30 IST
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓటీఎస్) కింద శనివారం నిర్వహించిన మెగామేళాలో 3,883 మంది దరఖాస్తు చేసుకొన్నారు.
ఇప్పటివరకు 16,303 మంది నగదు చెల్లింపు
జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్
గుంటూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓటీఎస్) కింద శనివారం నిర్వహించిన మెగామేళాలో 3,883 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఓటీఎస్ మొత్తాన్ని చెల్లించారు. ఈ ఒక్క రోజే రూ.3,78,77,040 నగదు ప్రభుత్వ ఖజానాకు జమ అయినట్లు కలెక్టర్ వివేక్యాదవ్ తెలిపారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 16,303 మంది రూ.15 కోట్ల 82 లక్షల ఏక మొత్తం రుణాన్ని చెల్లించారని పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఓటీఎస్ స్కీమ్ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లోని వారు రూ.10 వేలు, పురపాలక సంఘాల్లోని లబ్ధిదారులు రూ.15 వేలు, నగరపాలకసంస్థలో రూ.20 వేలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఉచితంగా రిజిస్ట్రేషన్ సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాల్లోనే జరిపిస్తామని చెప్పారు. సంపూర్ణ గృహ హక్కు పత్రం ఉపయోగించి బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చని తెలిపారు.