AP: విద్యార్థుల పట్ల పిడుగురాళ్ల పోలీసుల అరాచకం
ABN , First Publish Date - 2022-04-26T16:07:39+05:30 IST
విద్యార్థుల పట్ల పిడుగురాళ్ల పోలీసులు అరాచకంగా ప్రవర్తించారు.
గుంటూరు: విద్యార్థుల పట్ల పిడుగురాళ్ల పోలీసులు అరాచకంగా ప్రవర్తించారు. ఫ్లెక్సీలు చింపారంటూ విద్యార్థులను పోలీసులు స్టేషన్కు పిలిపించారు. పిడుగురాళ్ల మండలం జానపాడులో విద్యార్థులు ఆడుకుంటుండగా ఫ్లెక్సీ పొరబాటున చిరిగింది. దీనిపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పిల్లలను స్టేషన్కు పిలిపించిన పోలీసులు ఓ పూట స్టేషన్లో కూర్చోబెట్టారు. విషయం తెలిసిన స్థానిక టీడీపీ నేతలు... విద్యార్థులను వ్యక్తిగత పూచికత్తు మీద తీసుకెళ్లారు.