AP: రెండు బైక్లు ఢీకొని ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-12-01T13:35:17+05:30 IST
జిల్లాలోని మేడికొండూరు దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
గుంటూరు: జిల్లాలోని మేడికొండూరు దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతులు మాదలకు చెందిన బాజీ, నాగేంద్రలుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.