గుంటూరులో రోడ్డు ప్రమాదం..చిన్నారి మృతి

ABN , First Publish Date - 2021-01-25T14:59:05+05:30 IST

జిల్లాలోని ముప్పాళ్ళ మండలం గోళ్లపాడు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది.

గుంటూరులో రోడ్డు ప్రమాదం..చిన్నారి మృతి

గుంటూరు: జిల్లాలోని ముప్పాళ్ళ మండలం గోళ్లపాడు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. బైక్‌పై వెళ్తున్న తండ్రి, ఇద్దరు చిన్నారులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి పామూరి గాయత్రి(4) మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-25T14:59:05+05:30 IST