గుంటూరులో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన ఎస్‌ఈసీ

ABN , First Publish Date - 2021-09-18T18:48:26+05:30 IST

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

గుంటూరులో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన ఎస్‌ఈసీ

గుంటూరు: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లాలోని బి.ఈ.డి కళాశాలలోని ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎస్‌ఈసీ నీలం సాహ్ని పరిశీలించారు. ఎన్నికల అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రేంజ్ డి.ఐ.జి త్రివిక్రమ్ వర్మ, కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ అరీఫ్ హఫీజ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T18:48:26+05:30 IST