జగన్కు ప్రజలే బుద్ధి చెబుతారు: ఆంజనేయులు
ABN , First Publish Date - 2021-04-23T16:31:30+05:30 IST
దూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ను ఖండిస్తూన్నామని నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు అన్నారు.
గుంటూరు: దూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ను ఖండిస్తున్నామని నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు అన్నారు. టీడీపీపై కక్ష్య సాధింపు చర్యలలో భాగంగానే నరేంద్రను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. నరేంద్ర అరెస్టుతో సంగం డైయిరీని దెబ్బతీయాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కుట్రలను ప్రజలంతా గమనిస్తూన్నారని....ప్రజలే జగన్ రెడ్డికి బుద్ధి చెబుతారని ఆంజనేయులు తెలిపారు.