Guntur: తెనాలిలో మహిళ దారుణ హత్య
ABN , First Publish Date - 2021-08-29T16:37:07+05:30 IST
తెనాలిలో దారుణ హత్య జరిగింది. అర్ధరాత్రి తాడికొండ మైధీలీ మహిళా (52)ను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ప్యారడైజ్ అపార్ట్మెంట్లో
గుంటూరు: తెనాలిలో దారుణ హత్య జరిగింది. అర్ధరాత్రి తాడికొండ మైధీలీ మహిళా (52)ను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ప్యారడైజ్ అపార్ట్మెంట్లో ఉన్న మహిళ తెల్లవారుజామున డోర్ తెరవకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు డోర్ బద్దలు కొట్టి చూడటంతో మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. ఈ ఘటనపై అపార్ట్మెంట్ వాసులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళను కత్తితో పొడిచి చంపారని, జిల్లాలోని గంగానమ్మపేటలో మహిళ భర్త నారాయణమూర్తి పాన్ బ్రోకర్ వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. హత్యగల కారణాలు ఇంకా తెలియాల్సివుందని పోలీసులు వెల్లడించారు.