టీడీపీ అభ్యర్థులకు రక్షణ కల్పించండి.. కలెక్టర్కు ఎన్నికల కమిషన్ ఆదేశం
ABN , First Publish Date - 2021-11-05T02:40:52+05:30 IST
రజాల నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులకు నామినేషన్ వేసేందుకు పోలీసు రక్షణ కల్పించాలని ...
అమరావతి: గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులకు నామినేషన్ వేసేందుకు పోలీసు రక్షణ కల్పించాలని గుంటూరు కలెక్టర్ , రూరల్ ఎస్పీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశించినా తమ అభ్యర్థులకు రక్షణ కల్పించడంలేదని టీడీపీ ఆరోపించింది. గురువారం సాయంత్రం ఎన్నికల కమిషన్ను టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ చేసిన ఫిర్యాదుతో కలెక్టర్, గుంటూరు రూరల్ ఎస్పీకి ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు లేఖ రాశారు. టీడీపీ అభ్యర్థులకు నలుగురికి హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు రక్షణ కల్పించాలని లేఖలో కన్నబాబు పేర్కొన్నారు.