YCP Group war: గురజాల వైసీపీలో రెండు వర్గాల బాహాబాహీ

ABN , First Publish Date - 2022-08-18T18:12:46+05:30 IST

గురజాల వైసీపీలోని రెండు వర్గాల బాహాబాహీకి దిగాయి. నడికుడి ముగ్గురాయి అక్రమ మైనింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది.

YCP Group war: గురజాల వైసీపీలో రెండు వర్గాల బాహాబాహీ

పల్నాడు: గురజాల వైసీపీ (YCP)లోని రెండు వర్గాల బాహాబాహీకి దిగాయి. నడికుడి ముగ్గురాయి అక్రమ మైనింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. దేవళ్ళ రేవతి -  రమేష్ రెడ్డి వర్గాల మధ్య మైనింగ్ క్వారీ వద్ద ఘర్షణ నెలకొంది. క్వారీలోనే రెండు వర్గాలు (YCP Group war) బాహాబాహీకి దిగారు. ఆధిపత్య పోరులో రెండు వర్గాలు గొడవకు దిగాయి.  దేవళ్ల రేవతి వడ్డెర కార్పోరేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. కింద కూర్చుని మరీ రేవతి నిరసన వ్యక్తం చేశారు.  రమేష్ రెడ్డి... ఎమ్మెల్యే కాసు (MLA Kasu)ప్రధాన అనుచరులుగా ఉన్నారు. ఈ క్రమంలో పోలీసుల వ్యవహార శైలిపై రేవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-18T18:12:46+05:30 IST