భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి పూజలు
ABN , First Publish Date - 2020-07-06T10:27:16+05:30 IST
జిల్లావ్యాప్తం గా గురుపౌర్ణమి వేడుకలను ఆదివారం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఒంగోలు(కల్చరల్), జూలై 5 : జిల్లావ్యాప్తం గా గురుపౌర్ణమి వేడుకలను ఆదివారం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ దే వాలయాలలో కేవలం అర్చకబృందం ఏకాంతం గా పూజా కార్యక్రమాలను నిర్వహించి, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. ఒంగోలు నగరం మంగమూరు రోడ్డులోని అచలానంద ఆ శ్రమంలో అచలానంద స్వామి వారి విగ్రహానికి వెండికిరీటాన్ని సూదనగుంట కోటేశ్వరరావు, ప ద్మజ దంపతులు బహూకరించారు. ఆశ్రమ ని ర్వాహకులు స్వామి పరిపూర్ణ సిద్ధానంద ప్రత్యేక అభిషేకాలు చేశారు.
సంతపేట సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి సందర్భంగా బాబా విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు. మంది ర కమిటీ నిర్వాహకులు అళహరి చెంచలరావు పర్యవేక్షించారు. అదేవిధంగా కేశవస్వామిపేట లోని శ్రీత్యాగరాజస్వామి విగ్రహానికి లలిత కళా అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ సంతవేలూరి కో టేశ్వరరావు పూజలు చేశారు. లాయర్పేట సా యిబాబా మందిరం, మంగమూరు రోడ్డు శ్రీస త్యసాయి సేవామందిరం, సంతపేట శ్రీ వెంక య్యస్వామి మందిరం, శ్రీ రాఘవేంద్ర బృందావ నం తదితర ఆలయాలలో గురుపౌర్ణమి సంద ర్భంగా పూజలను ఏకాంతంగా నిర్వహించారు.
చీరాల: పేరాల గంగాభ్రమరాంబసమేత పు నుగురామలింగేశ్వరాస్వామి వారి దేవస్ధానంలో ఆదివారం ఆషాఢమాస గురుపౌర్ణమిని పునస్క రించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అ లాగే, స్ధానిక షిర్డీ సాయిబాబా ఆలయాల్లో ప్ర త్యేక పూజలు జరిగాయి. లాక్డౌన్ నేపథ్యంలో పూజలలో భక్తులు తక్కువగా అనుమతించారు.
అద్దంకి: శింగరకొండలోని శ్రీప్రసన్నాంజనేయ స్వామికి ఆదివారం లక్ష తమలపాకులతో పూజ నిర్వహించారు. పరిమిత సంఖ్యలో భక్తులు స్వా మివారిని దర్శించుకున్నారు.
తాళ్లూరు: గురుపౌర్ణమి సందర్భంగా మండలంలోని కొత్తపాలెం, నాగంబొట్లపాలెం సాయిబాబా ఆలయాల వద్ద ఆదివారం భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. భౌతికదూరం పాటి స్తూ మహిళలు పూజల్లో పాల్గొన్నారు.
చినగంజాం: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ని ర్వహించారు. స్థానిక హనుమ సాయి కుటీరం లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణ మిని పురస్కరించుకుని అభిషేకాలు, విశేషపూజ లు నిర్వహించారు.
మార్కాపురం(వన్టౌన్): పట్టణంలోని బోడ పాడు రోడ్డు వాల్మీకి మహర్షి మందిరంలో ఆది వారం వాల్మీకి సేవా సంఘం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా వాల్మీకి మహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సం ఘ అధ్యక్షుడు పి. వెంకటరమణ, సెక్రటరీ మం డ్ల వెంకటేశ్వర్లు, ఎం. శ్రీను పాల్గొన్నారు. నెహ్రూ బజార్లోని శ్రీ షిరిడిసాయి బాబా మందిరంలో ఆదివారం గురుపౌర్ణమి సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో భక్తులకు బాబా దర్శనం నిలిపివేశారు.
కొండపి : కొండపిలోని శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పరిమిత సంఖ్యలో పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో మందిర కమిటీ నిర్వాహకుడు పి.సీతారామయ్య అర్చకస్వామి వి జయకృష్ణమాచార్యులు పాల్గొన్నారు.