మరింత మెరుగ్గా గురుకులాలు
ABN , First Publish Date - 2021-07-25T08:24:39+05:30 IST
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆ విద్యా సంస్థల కార్యదర్శి రొనాల్డ్ రోస్ అధికారులకు..
- ఉన్నతాధికారులతో సమీక్షలో రొనాల్డ్ రోస్
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆ విద్యా సంస్థల కార్యదర్శి రొనాల్డ్ రోస్ అధికారులకు సూచించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత ఆయన స్థానంలో రొనాల్డ్ రోస్ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. తెలంగాణ దళిత, గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రొనాల్డ్ రోస్ ఆ విభాగాల ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గురుకుల పాఠశాలల స్థితిగతులు, ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు ఇతరత్రా వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.