గురువుల నిరసన గళం
ABN , First Publish Date - 2021-07-24T06:07:18+05:30 IST
ఉపాధ్యా యుల సమస్యలపై రాష్ట్ర ఉపాధ్యాయ ఐక్య వేదిక (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నినాదాలు
సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, డీఏల మంజూరుకు డిమాండ్
నర్సీపట్నం, జూలై 23 : ఉపాధ్యా యుల సమస్యలపై రాష్ట్ర ఉపాధ్యాయ ఐక్య వేదిక (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సం దర్భంగా వేదిక ప్రతినిధులు మాట్లా డుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పీఆర్సీ నివేదికను తక్షణమే అమలు చేయాలని, నిలుపుదల చేసిన ఆరు డీఏలు మంజూరు చేయాలని, ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులు తరలించ వద్దని కోరారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఏపీటీఎఫ్, యూటీఎఫ్, ఏపీసీపీఎస్ఈఏ, హెచ్ఎంఏ సంఘాల ప్రతినిధులు ఆర్.ప్రకాశరావు, పి.అప్పారావు, కేవీ రమణ, సతీశ్, కె.సత్యనారాయణ, నరసింహం, బ్రహ్మాజీ, ఎన్ఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.