Panjagutta: పాన్షాపులో పోలీసుల తనిఖీలు..253 Gutka packets స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-27T13:44:28+05:30 IST
గుట్కాలు విక్రయిస్తున్న పాన్షాపులో పంజాగుట్ట పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. పంజాగుట్టకు చెందిన సయ్యద్ ఖాదర్ హుస్సేన్ పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో ఖాదర్ పాన్షాపు
హైదరాబాద్/పంజాగుట్ట: గుట్కాలు విక్రయిస్తున్న పాన్షాపులో పంజాగుట్ట పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. పంజాగుట్టకు చెందిన సయ్యద్ ఖాదర్ హుస్సేన్ పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో ఖాదర్ పాన్షాపు నిర్వహిస్తున్నాడు. పలు కంపెనీలకు చెందిన గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు షాపులో తనిఖీలు చేసి 253 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఖాదర్పై కేసు నమోదు చేశారు.